మైత్రీం భజత
మైత్రీం భజత , అఖిల హృత్ జైత్రీం ఆత్మవదేవ పరాన్నపి పశ్యత యుద్ధం త్యజత , స్ఫర్ధాం త్యజత త్యజత పరేషు అక్ర మాక్ర మణం !! జననీ పృథివీ కామదు ఘాస్తే జనకో దేవః సకల దయాళుః ' దామ్యత , దత్త , దయధ్వం ' జన తాః శ్రేయో భూయాత్ సకల జనానాం !! (ఈసందేశం 23 అక్టోబర్, 1966 ఐక్యరాజ్య సమితిలో శ్రీమతి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గారిచే గానం చేయబడింది.). కంచి మహాస్వామి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ప్రసాదించిన సంస్కృత గీతం. దీనిని ’అంతర్జాతీయ గీతం’గా పేర్కొనవచ్చు. "అందరి హృదయాలనీ జయించే ’మైత్రి’ని మనం స్వీకరించాలి. ఇతరుల్ని ’మన’లాగే చూడాలి. యుద్ధాన్నీ, స్పర్థనీ, అక్రమమైన ఆక్రమణలని విడనాడాలి. అన్ని కోరికలూ తీర్చే ఈ భూమి మన తల్లి. సర్వేశ్వరుడు, దయామయుడు భగవంతుడే మన తండ్రి. దామ్యత - నిగ్రహణ కావాలి. ’దత్త’ , అవసరంలో ఉన్నవారిని ఆదుకొనేలా సహాయాన్ని అందించాలి. ’దయధ్వం’ - సానుభూతితో కూడిన సహకారభావమే ’దయ’, దానిని చూపించాలి ఈమూడు ’ద’కారాలు కావాలి. సకల జనములకు శ్రేయస్సు కలగాల...